ముస్కాన్‌.. నీతితప్పినవారికో గుణపాఠం!

PTI03_19_2025_000303A-e1742623103333.jpg

ప్రేమించి పెళ్లాడాడు. ప్రేమగా చూసుకున్నాడు. కానీ తను వేరొకరి వలలో పడింది. వివాహేతర సంబంధానికి మాంగల్యబంధం అడ్డుగోడలా కనిపించింది. మత్తులో ముంచిన ప్రియుడి సాయంతో భర్తని దారుణాతిదారుణంగా చంపేసింది. నాన్న డ్రమ్ములో ఉన్నాడని చిన్నారి చెబుతుంటే చుట్టుపక్కలవారికి ముందు విషయం అర్ధంకాలేదు. పోలీసులు ఎంటరై సిమెంట్‌ కాంక్రీట్‌ నింపిన ఆ డ్రమ్ముని బద్దలుకొట్టాకే బయటపడింది ఘోరం. మీరట్‌లోనేవీ ఆఫీసర్‌ మర్డర్‌ కేసులో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్‌, ముస్కాన్‌లది లవ్‌ మ్యారేజీ. వాళ్లకు ఓ కూతురు కూడా ఉంది. సౌరభ్‌ నేవీ ఆఫీసర్‌. డ్రగ్స్‌కు బానిసైన ముస్కాన్‌, సాహిల్‌ ట్రాప్‌లో పడింది. ప్రియుడితో స్వేచ్ఛగా తిరుగుతుంటే కూతురి బర్త్‌డే కోసం లండన్‌ నుంచి భర్త తిరిగిరావటం ముస్కాన్‌కి నచ్చలేదు. మత్తుమాత్రలు కలిపిన భోజనాన్ని ప్రేమగా వడ్డించింది. నిద్రలోకి జారుకోగానే భర్త గుండెల్లోకి కత్తిని దించింది.ప్రియుడు భర్త తల, చేతుల్ని తీసుకెళ్తే, ఆతని మొండేన్ని బెడ్‌ రాక్‌లో దాచి అదే మంచంపై ప్రశాంతంగా నిద్రపోయింది.

15 ముక్కలుగా నరికిన సౌరభ్‌ శరీరభాగాల్ని ఓ డ్రమ్ములో కుక్కి సిమెంట్‌తో ప్లాస్టరింగ్‌ చేసి ప్రియుడితో మనాలీకి చెక్కేసింది ముస్కాన్‌. భర్త ఫోన్‌తో సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతూ తమ నేరం బయటపడదనుకుంది. కానీ
సౌరభ్‌ కన్పించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపు కూతురే అల్లుడిని హత్య చేసిందని ముస్కాన్‌ పేరెంట్స్‌ పోలీసులను ఆశ్రయించారు. దాంతో డ్రమ్ములో సౌరభ్‌ డెడ్‌బాడీని పోలీసులు ట్రేస్‌ చేశారు.

సౌరభ్‌ను చంపేసి డ్రమ్ములో కాంక్రీట్‌తో పూడ్చేసి హిల్‌స్టేషన్‌లో షికార్లుకొట్టిన ముస్కాన్‌, సాహిల్‌ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. తమ అల్లుడు చాలా మంచివాడంటున్న ముస్కాన్‌ తల్లిదండ్రులు.. సౌరభ్‌ను చంపిన తమ కూతురిని ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తామే ముస్కాన్‌ని చంపేస్తామంటున్నారు. ఉరితాడుకు వేలాడే పన్లేదు. నీతితప్పిన ముస్కాన్‌లాంటివారికి ఈ సమాజం ఎప్పుడో మరణశిక్ష విధించేసింది.

Share this post

submit to reddit
scroll to top