రెండు రైళ్లు ఢీ.. విజయనగరంలో ఘోరప్రమాదం

Train-accident.jpg

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 14మంది మరణించారు. దాదాపు వందమంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. రాత్రి 7.15 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం పట్టాలపై ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్యాసింజర్‌ రైలుని దాని వెనుకే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ఢీ కొట్టింది. మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు ఢీకొనడంతో విద్యుత్‌ వైర్లు తెగిపోయి చీకటి అలుముకోవటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

కోల్‌కతా-చెన్నై మార్గంలో రైలు ప్రమాదం జరగడంతో భువనేశ్వర్‌ దగ్గర కొన్ని రైళ్లను నిలిపివేశారు. కోల్‌కతా వైపు రైళ్లను విశాఖ తదితర స్టేషన్లలో నిలిపేశారు. విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద దుర్ఘటనతో అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

దుర్ఘటనలో పలాస ప్యాసింజర్ రైలు గార్డుతో పాటు రాయగడ ట్రైన్ లోకో పైలట్ కూడా మరణించారు. ప్యాసింజర్‌ రైలు కావడం, ప్రమాద సమయంలో మూడు బోగీల్లో 200మందికి పైగా ఉండటంతో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడం కష్టంగా ఉంది. బాధితుల సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 94935 89157, రైల్వే కార్యాలయంలో 89780 80006 నెంబర్లను సంప్రదించాలని కలెక్టర్‌ ప్రకటించారు.

Share this post

submit to reddit
scroll to top